Tourist Attractions

ముత్తులూరుపాడులో బుక్కరాయల కాలం నాటి శాసనం లభ్యం!

కడప జిల్లా ఖాజీపేట మండలం ముత్తులూరుపాడులో తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ విజయనగర ప్రభువైన బుక్కరాయల కాలం నాటి అరుదైన శాసనాన్ని కనుగొంది. గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న ఈ శాసనాన్ని తెలుగు సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్ రెడ్డి, ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ఏ.వీరాస్వామి, కార్యదర్షి ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, సహాయ కార్యదర్శి ధర్మిసెట్టి వెంకట రమణయ్య  నెల రోజుల కిందట గుర్తించారు. ఈ శాసనం చాయా చిత్రాన్ని తీసుకుని కడప లోని బ్రౌన్ తెలుగు పరిశోధనా కేంద్రం  పరిశోధకులు కట్టా నరశిం హులు దృష్టికి తీసుకెళ్ళడం తో మైసూరు, చెన్నై లకు చెందిన భారత పురావస్తు శాఖ శాసనాల విభాగపు అధికారులు  2010 జనవరి 11 వ తేదీన  ముత్తులూరు పాడు కు వచ్చి శాసనాన్ని పరిశీలించారు. శక సంవత్సరం 1287 ( క్రీ. శ. 1365) కాలం నాటి శాసనంగా వారు ఈ శాసనాన్ని గుర్తించారు.  భారత పురావస్తు శాఖ వార్షిక ప్రచురణలో ఈ శాసనం వివరాలను ప్రచురిస్తామని వారు తెలిపారు. గ్రామానికి చెందిన వారు అప్పట్లో మల్లికార్జున, భోగనాధ దేవరలకు భూమిని దానం గా ఇచ్చినట్లుగా ఈ శాసనంలో లిఖించారు.

Read :  MLAs walkout of Assembly Supporting YS Jagan

చిత్రం: ఈనాడు దిన పత్రిక వార్తాంశం. 12 జనవరి 2010.

mpadu

Check Also

Kadapa Slabs vs Rajasthan Marble

Kadapa Slabs vs Rajasthan Marble: A Smarter Choice for Your Floors Choosing the right flooring …

Madanapalli to Mydukur Bus Timings & Schedule

Madanapalli to Mydukur Bus Timings & Schedule

Find APSRTC bus timings from Madanapalli to Mydukur. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Madanapalli and Mydukur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *