వంగపల్లి : వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త జీర్ణించుకోలేని మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వరంగల్ జిల్లాకు త్వరలోనే మళ్లీ వస్తానని కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వంగపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఆయన్ని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ… బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లటమే తప్పా అని ప్రశ్నించారు. ఇటువంటి క్షుద్ర రాజకీయాలను చేయటం అనేది ఎంత వరకూ సమంజసమో రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలన్నారు.
వందమంది టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు దాడి చేయటం వల్ల తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లటం ఎంతవరకూ సబబు అని జగన్ ప్రశ్నించారు. తను చేపట్టిన ఓదార్పు యాత్రను టీఆర్ఎస్ రాజకీయం చేసిందన్నారు. చనిపోయిన 77 కుటుంబాల్లో ఎక్కువమంది దళితులేనన్నారు. వారంతా నిరుపేద కుటుంబాలన్నారు. వరంగల్ జిల్లాలో తన పర్యటన ఆగిపోతుందేమోననే గుండె ఆగిన యాదగిరి, ఎల్లయ్యలకు తాను సమాధానం చెప్పుకోవాలన్నారు. తన యాత్రను అడ్డుకుంటానన్న టీఆర్ఎస్ నేతలైన హరీష్రావు, ఈటెల రాజేందర్, కోదండరామ్లు మహబూబాబాద్కు కానీ, వరంగల్ జిల్లాకు గానీ చెందినవారా అని జగన్ ప్రశ్నించారు.
బయటవారిని తీసుకువచ్చి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూమ్లో ఉన్న ఎమ్మెల్యేలపై రాళ్లదాడి చేయటం ఎంతవరకూ సరైనదని జగన్ అన్నారు. వారి ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. తనను పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్లినా సమయం అనుకూలించాక బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మళ్లీ వస్తానని జగన్ స్పష్టం చేశారు.
జగన్ అరెస్ట్ సరికాదు: లగడపాటి
అలాగే కొండా సురేఖ దంపతుల గన్మెన్ కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయినట్లు ఆమె తెలిపారు. కొండా సురేఖ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మహబూబాబాద్ ఘటనపై డీజీపీ గిరీష్కుమార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని హోంమంత్రి తెలిపారు.
www.kadapa.info Voice of the YSR Kadapa District
KCR down…down…
YS Jagan Jindabad.